వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూటమి నేతలు, చంద్రబాబు బినామీ గ్యాంగ్లు, మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, వారి ఫ్రస్టేషన్ అర్ధమవుతోందని వైయస్ఆర్సీపీ నేత, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత కూటమి పార్టీ నాయకులు, మంత్రులు చేసిన ఆరోపణలపై వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారుకూతలు కూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూటమి నేతలు, చంద్రబాబు బినామీ గ్యాంగ్లు, మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్అన్నారు.
అయన మాట్లాడుతూ..... వారి ఫ్రస్టేషన్ అర్ధమవుతోంది, చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వలేదా, హామీలు అమలుచేయకపోతే చొక్కా పట్టుకోమని చెప్పలేదా, లోకేష్ గారు కాలర్ పట్టుకుని నిలదీయమన్న సంగతి మరిచారా, మరి ఇప్పుడు హామీల గురించి మాట్లాడితే మేం రూ. 1000 పెన్షన్ పెంచామంటున్నారు, అయితే 2 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి పెన్షన్ ఇస్తున్నారు, ఏం సమాధానం చెబుతారు. జగన్ గారు తన దగ్గర ఉన్న డేటాతో వాస్తవాలు చెప్పారు, మీరు ఏ విధంగా విఫలమయ్యారు, మేం జగన్ గారి పాలనలో అభివృద్దిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం, ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా రూ. 2.73 లక్షల కోట్లు అందించామో వివరించారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మీరు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయండి, మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఏమైంది, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వేల మందిని తొలగించింది వాస్తవం కాదా, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అసమర్ధ పాలనతో, నాయకత్వ లోపంతో, పైకి పొత్తులు లోపల కత్తులు పెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నది మీరు కాదా?నిజంగా జగన్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఒక్క ఆధారమైనా ఉందా, నిరాధార ఆరోపణలు మాని ప్రజలకు సేవ చేయండి, బాధ్యతతో వ్యవహరించండి, ఇలా దిగజారి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం, నిందలు వేస్తూ కాలం గడుపుతున్న మీ అసమర్ధ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారు అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa