ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్.. డిప్యూటీ సీఎం రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:32 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయనను ఇబ్బంది పెడుతోందని.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం నాలుగు రోజుల క్రితం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. " ఆంధ్రప్రదేశ్ డైనమిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారువేగంగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.." అంటూ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.


మరోవైపు హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు." కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిన ప్రేమ, సానుభూతికి కృతజ్ఞతలు. మీ మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయి.." అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రివర్గంలోని పలువురు నేతలతో పవన్ కళ్యాణ్‌కు స్నేహం ఉంది.


ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నట్లు తెలిసింది. సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతిలో సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణకు వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. కేంద్ర పెద్దలను కలిసి వారాహి డిక్లరేషన్ కూడా అందజేశారు. తాజాగా దేవాలయాల సందర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com