ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయుడిని పొట్టుపొట్టు కొట్టిన ప్రిన్సిపాల్.. ఎందుకంటే

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 08:02 PM

గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలో.. హితేంద్ర సింగ్ ఠాకూర్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అయితే అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్ పిల్లలకు గణితం, సైన్సు బోధిస్తున్నారు. చాలా రోజులుగా రాజేంద్ర పర్మార్ పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులే ప్రిన్సిపాల్ వద్దకు వచ్చి పర్మార్‌పై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను ఎలాగై తీర్చాలనుకున్న ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ రాఠూర్.. ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు ఓ సమావేశం నిర్వహించారు.


 ఉపాధ్యాయులు అందరినీ పిలిచి పాఠశాల పరిస్థితి గురించి చర్చించారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం బోధింతే రాజేంద్ర పర్మార్‌తో మాట్లాడుతూ.. మీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఇందుకు సమాధానం చెప్పాలని కోరారు. దీనికి రాజేంద్ర పర్మార్.. సరిగ్గా స్పందించకపోవడంతో ప్రిన్సిపాల్ ఫైర్ అయ్యారు. సరైన సమాధానం చెప్పాలంటూ గట్టిగా మాట్లాడగా.. ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్ దురుసుగా మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రధానోపాధ్యాయుడు అందరికీ షాక్ ఇచ్చారు.


ముఖ్యంగా తాను కూర్చున్న కుర్చీ నుంచి ఆగ్రహంగా లేచి వచ్చి సదరు ఉపాధ్యాయుడి గల్లా పట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం ప్రారంభించారు. కేవలం 25 సెకన్లలోపే 18 సార్లు చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా సదరు ఉపాధ్యాయుడి కాలు పట్టి లాగి కింద పడేశారు. ఈక్రమంలోనే తోటి ఉపాధ్యాయులు వచ్చి ఇద్దరినీ ఆపారు. కానీ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకున్నారు. అయితే ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. జిల్లా విద్యాశాఖ అధికారి స్వాతిబా రౌల్ ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈక్రమంలోనే సదరు అధికారులు వీరిద్దరి వద్దకు వెళ్లగా.. ప్రిన్సిపాల్ తనపై తీవ్రంగా దాడి చేశారని పర్మార్ చెప్పుకొచ్చారు. దుర్భాషలాడుతూ.. అనేక సార్లు కొట్టారని వివరించారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయుడు ఠాకూర్ పిల్లల చేస పాదాలకు మసాజ్ చేయించుకున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్మార్ విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పకుండా ఆయన ఇంటికి తీసుకెళ్లి పని చేయించుకునేవారని చెప్పుకొచ్చారు. ఇందులో ఏది నిజమో తేలిన తర్వాత జిల్లా విద్యాశాఖాధికారులు వీరిపై చర్యలు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com