ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటీవల కిన్నార్ అఖాడాలో చేరిన మమతా కులకర్ణి

national |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 08:35 PM

బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల కిన్నార్ అఖాడాలో చేరడం, ఆమెను మహామండలేశ్వర్ గా నియమించడం తెలిసిందే. అయితే ఇతర అఖాడాలు దీన్ని తప్పుబట్టాయి. పలువురు మత పెద్దలు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మమత నియామకం పట్ల కిన్నార్ అఖాడాలో సైతం భేదాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్, ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దాంతో లక్ష్మీనారాయణ త్రిఫాఠిపై వేటు పడింది. ఈ నేపథ్యంలో, మమతా కులకర్ణి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ సాధ్విగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన బాల్యం నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. మమతా కులకర్ణి గతంలో వేల కోట్ల డ్రగ్స్ కేసులోనూ చిక్కుకోవడం తెలిసిందే. పైగా, ఎలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేకపోయినప్పటికీ, అఖాడాలో చేరిన వెంటనే మహామండలేశ్వర్ పదవిని పొందడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రూ.10 కోట్లు చెల్లించి ఆ పదవిని అందుకున్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com