ఏపీలో టూరిజం ఐల్యాండ్ల అభివృద్ధికై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో పర్యటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పర్యటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటక రంగంలో 20 శాతం వృద్ధిరేటు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
![]() |
![]() |