ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 10:13 AM

రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో ఈ ప్రకృతి విపత్తు సంభవించింది. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అల్టాయ్ రిపబ్లిక్‌లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో అధికారులు భూకంప కేంద్రాన్ని గుర్తించారు.జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం ఫిబ్రవరి 15, 2025 శనివారం రష్యాలోని నైరుతి సైబీరియాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో సంభవించినట్లుగా పేర్కొంది. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు వెల్లడించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa