ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్ బయలుదేరిన టీమిండియా...

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 11:12 PM

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు దుబాయ్ పర్యటనకు బయలుదేరింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20న ఆడబోతుంది. ఈ నేపథ్యంలో నేడు ముంబై విమానాశ్రయం నుండి భారత ఆటగాళ్లు పయనమై వెళ్లారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సహా ఈ టోర్నీకి ఎంపికైన జట్టు సభ్యులు అందరూ దుబాయ్ కి పయనమయ్యారు. ఈ టోర్నమెంట్ దాదాపు 3 వారాలపాటు కొనసాగనుంది. దీంతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. కొత్త విధానం ప్రకారం 45 రోజులకు మించిన టోర్నీలో మాత్రమే కుటుంబ సభ్యులు గరిష్టంగా రెండు వారాలపాటు జట్టుతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కాకుండా సింగిల్ గానే దుబాయ్ కి పయనమయ్యారు. భారత్ ఫిబ్రవరి 20న మొదట బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఆ తర్వాత 23న దాయాది పాకిస్తాన్ తో తలపడుతుంది. ఇక మార్చ్ 1 న కివీస్ తో రోహిత్ సేన తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa