ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యంమత్తులో భార్యని హతమార్చిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 11:53 AM

 మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ మాదనపల్లెలో చోటుచేసుకొంది. రాళ్లబుదుగూరు ఎస్‌ఐ నరేష్‌ కథనం మేరకు...మాదనపల్లెకు చెందిన దంపతులు మునస్వామి(45) మంగమ్మ(36)లకు ముగ్గురు పిల్లలు ప్రకాష్‌, రమ్య, కావ్య ఉన్నారు. ప్రకాష్‌ ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీ చదువుతుండగా రమ్య, కావ్య కడపల్లె కస్తూరిబా గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. మంగమ్మ కూడా అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తోంది. మద్యానికి బానిసగా మారిన మునస్వామి భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం కొనుక్కోవడానికి డబ్బివ్వాలంటూ మంగమ్మతో తీవ్రంగా గొడవ పడ్డాడు.ఆ కోపంతో అదే రోజు రాత్రి నిద్రిస్తున్న మంగమ్మను రాడ్‌తో తీవ్రంగా కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. శనివారం ఉదయం భార్య మృతి చెందిందని తెలుసుకొన్న మునస్వామి రాళ్లబుదుగూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎస్‌ఐ నరేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అమ్మ మృతి చెంది తండ్రి జైలుపాలు కావడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa