విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ స్టార్ట్ అయ్యింది. ముఖ్య అతిథిలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి .. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తలసేమియా బాధితుల కోసం భువనేశ్వరి చేపట్టిన మ్యూజిక్ నైట్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీని ద్వారా వచ్చే నగదును తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం భువనేశ్వరి వినియోగించనున్నారు. కాగా, తమన్ తన పాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నారు. తన టీమ్తో కలిసి తమన్ చేస్తున్న హంగామా శ్రోతలను కట్టిపడేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa