ట్రెండింగ్
Epaper    English    தமிழ்

GBS కలకలం.. 59 కేసులు నమోదు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 11:30 AM

AP: రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపుతోంది. నిన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ జీబీఎస్ బారిన పడి ప్రాణాలు విడిచింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. కానీ 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు.అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభంలో అందరిలో ఒకేలా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు బయటపడుతున్నట్లు వివరిస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కొందరిలో దగ్గు, జ్వరంతోపాటు కాళ్లు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరిలో విరేచనాలతో వ్యాధి లక్షణాలు ప్రారంభం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి నరాలపై ప్రభావం చూపుతోందని, యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మెుత్తం నాడీవ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa