ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 07:57 PM

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి శుభవార్త వినిపించారు. ఉద్యోగాల నుంచి ఎవరినీ తొలగించమని ప్రకటించారు, ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను మంత్రి తోసిపుచ్చారు. అలాంటి వదంతులు నమ్మవద్దని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రోజున.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పదోన్నతులు, పీఆర్సీ వంటి అంశాలను మంత్రి వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. అనంతరం మాట్లాడిన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయనున్నట్లు వివరించారు. సర్వీసు నిబంధనల రూపకల్పన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణ ప్రక్రియలో కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వదంతులు వస్తున్నాయన్న మంత్రి.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎవరినీ తొలగించడం లేదని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.కొన్ని శాఖలలో ఖాళీలు ఉన్నాయన్న మంత్రి వీరాంజనేయస్వామి త్వరలోనే వాటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా పోలీసుల విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువగా, మరి కొన్నిచోట్ల తక్కువగా ఉండటంతో ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారుగా 1,30,694 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఒక్కోచోట ఎక్కువగా, మరో చోట తక్కువగా ఉన్నారనే కారణంతో హేతుబద్దీకరణ చేపట్టారు. జనాభా ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా ఏపీ ప్రభుత్వం విభజించింది. 2,500 మంది లోపు జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీ కింద.. 2,500 నుంచి 3500 మంది ఉన్న సచివాలయాలకు బి కేటగిరి కిందకు చేర్చారు. ఇక 3,500 కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే వాటిని సీ కేటగిరీ కిందకు చేర్చి ఉద్యోగులను కేటాయిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa