ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ చేసిన ఒక్క డ్యాన్సుతో చిక్కుల్లో యువతి ప్రభుత్వ ఉద్యోగం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 08:22 PM

మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 33 ఏళ్ల ప్రియాంక కడమ్ అనే మహిళ.. దివ్యాంగ కోటాలో ఉద్యోగం సాధించింది. ముఖ్యంగా ఉజ్జెయిన్‌లోని ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో ఆడిట్ ఆఫీసర్‌గా ఎంపికైంది. అయితే ఇటీవలే ఆమె ఓ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీంతో ఆమెకు ఎలాంటి వైకల్యం లేదని అసలెలా దివ్యాంగ కోటాలో ఉద్యోగం ఇచ్చారంటూ నెటిజెన్లు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే విచారణ జరిపించాలంటూ ఓ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో సర్కారు వివచారణకు ఆదేశించింది.


ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక కడమ్.. తనకు నిజంగానే వైకల్యం ఉందని చెప్పింది. అందుకు సంబంధించి తన దగ్గర సదరమ్ సర్టిఫికేట్ కూడా ఉందని.. అందులో 45 శాతం డిజైబులిటీ ఉన్నట్లు వివరించింది. 2017లో బాత్రూంలో పడడం వల్ల తన తొంటికి గాయమైందని.. ఎంఆర్ఐ స్కానింగ్‌లో తనకు ఎవాస్కూలార్ నెక్సోసిస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని చెప్పుకొచ్చింది. దీని వల్ల ఇప్పటికే తనకు నాలుగు సార్లు ఆపరేషన్ జరిగిందని.. చూసేందుకు వైకల్యం కనిపించకపోయినా.. సర్జరీలో అమర్చిన ఇంప్లాంట్స్ వల్లే తాను నడవగల్గుతున్నట్లు వెల్లడించింది.


కేవలం నడవడం మాత్రమే కాకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు డ్యాన్స్ కూడా చేయగలనని ప్రియాంక కడమ్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేయగా.. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా దివ్యాంగ కోటాలో ఎంపిక అయిన వారు భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాల్సి ఉండగా.. ప్రియాంక కడమ్‌ను అక్కడకు తీసుకు వెళ్లనున్నారు. అక్కడి వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే ఈమె ఉద్యోగంలో చేరుతారా లేదా అనేది తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa