ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మ దేవస్థానం వద్ద మల్టీ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 10:01 AM

దుర్గమ్మ దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో కీలకమైన మల్టీ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంపై దేవస్థాన అధికారులు కసరత్తు చేస్తున్నారు. దుర్గగుడిని శాశ్వతంగా అభివృద్ధి చేయటానికి వీలుగా మాస్టర్‌ ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్న నేపథ్యంలో పార్కింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ మల్టీ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో కింద నుంచి పైవరకు సుమారు 150 కార్లు, కనకదుర్గానగర్‌లో సుమారు 100 కార్లకు పార్కింగ్‌ మాత్రమే ఉంది. మిగిలిన కార్లను పార్కింగ్‌ చేయటానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆలయ అధికారులు కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలోకి వాహనాలను అనుమతించడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా దేవస్థానం అధికారులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇరిగేషన్‌ స్థలాన్ని వాడుకుంటున్నారు. అయినా వాహనాలు పెద్ద సంఖ్యలో రావటంతో పార్కింగ్‌కు సమస్యగానే ఉంది. ఈ నేపథ్యంలో మల్టీ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయితే పార్కింగ్‌ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa