ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని నాగేశ్వరరావు పార్క్‌ను త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 10:07 AM

విజయవాడ,పటమట పదో డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్క్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఆయన పటమట, పంట కాలువ రోడ్డును, బెంజ్‌ సర్కిల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటమటలో 50 సెంట్ల విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్క్‌లో కాలుష్యాన్ని తగ్గించే విధంగా రకరకాల మొక్కలతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ప్రజల ఆరోగ్యానికి ఓపెన్‌ జిమ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుధ్యాన్ని పరిశీలించారు. పంట కాల్వలో మ్యాన్‌ హోల్‌ తెరిచి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే మూసి వేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను సక్రమంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ప్రభుదాస్‌, చీఫ్‌ సిటీ ప్లానర్‌ జి.వి.జి.ఎస్‌.వి ప్రసాద్‌, ఇన్‌చార్జి సీఎంహెచ్‌వో డాక్టర్‌ సురేష్‌ బాబు, ఈఈ సామ్రాజ్యం, ఏఎంహెచ్‌వో గోపి నాయక్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa