ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం, విద్యార్ధులకి గాయాలు ఆసుపత్రికి తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 12:07 PM

కృష్ణాజిల్లా, గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాధాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థన మందిరంలో ఉన్న వారు, స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద తప్పిన ప్రమాదం తప్పింది. లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తం ఎగసి పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బటకు తీసుకొచ్చారు. విద్యార్థులు బటకు పరుగులు తీశారు. అయితే ఓ గదిలో ఆరుగురు విద్యార్థులు చిక్కుకు పోయారు. తలుపులు పగులగొట్టిన సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa