ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకేసుని ఛేదించిన పోలీసులు, కుటుంబసభ్యులే హంతకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:13 AM

ప్రకాశం జిల్లా, కంభంలో సంచలనం సృష్టించిన కదం శ్యాంప్రసాద్‌ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యులే నిందితులను కడతేల్చారు. శ్యాంప్రసాద్‌ తల్లి, ఇద్దరు సోదరులతోపాటు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మార్కాపురం డీఎస్పీ నాగరాజు మంగళవారం కంభం పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న శ్యాంప్రసాద్‌ మద్యానికి బానిసై సంపాదన మొత్తాన్ని మద్యానికే ఖర్చు చేసేవాడు. మద్యం మత్తులో తరచూ కుటుంబసభ్యులతో గొడవ పడేవాడు. ఇరుగుపొరుగు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. తనకు పిన్ని వరుసయ్యే మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో శ్యాంప్రసాద్‌కు దేహశుద్ధి చేసిన బంధువులు తల్లికి ఫిర్యాదు చేశారు. దీనిపై పెద్దలు పంచాయితీ కూడా చేశారు. అయినా శ్యాంప్రసాద్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈనెల 8న ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిపట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావులు శ్యాంప్రసాద్‌ను మందలించాడు. ఈనెల 12న డ్రైవర్‌ ఉస్మాన్‌బాషతో కలిసి లారీకి క్లీనర్‌గా ఓర్వకల్లు వెళ్లి అక్కడ మద్యం సేవించాడు. డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నాడు. దీంతో డ్రైవర్‌ లారీ యజమానికి ఫోన్‌ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న తల్లి, తమ్ముడు శ్యాంప్రసాద్‌ను ఇంటికి తీసుకువచ్చారు. 13వ తేదీ ఉదయం శ్యాంప్రసాద్‌ మద్యంసేవించి ఇంటికి వచ్చి తల్లి, అన్న, తమ్ముడితో తీవ్రంగా గొడవపడ్డాడు. తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావు, సుబ్రహ్మణ్యం స్నేహి తుడు ఆటో డ్రైవర్‌ అయిన వి.మోహన్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం శ్యాంప్రసాద్‌ను గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహాన్ని ఎక్కడికన్నా తీసుకెళ్లి పడేయాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో నలుగురూ కలిసి శ్యాంప్రసాద్‌ మృతదేహాన్ని కత్తి, గొడ్డలితో 8 ముక్కలుగా నరికి 3 ప్లాస్టిక్‌ సంచుల్లో నింపారు. అనంతరం ఇంటికి దగ్గరలోని నక్కలగండి కాలువలో పడేసినట్లు డీఎప్పీ తెలిపారు. నిందితులైన మృతుడి తల్లి, ఇద్దరు సోదరులతోపాటు ఆటోడ్రైవర్‌ మోహన్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. స్వల్పవ్యవధిలోనే కేసును చేధించిన డీఎస్పీ నాగరాజును, కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావులను ఎస్పీ అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa