ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖైదీలు నేరాలోచనలు మాని మంచి పౌరులుగా మారాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:54 AM

శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్పవర్తనను అలవర్చుకుని మంచి పౌరులుగా మారాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఖైదీలకు సూచించారు. స్థానిక పంచలింగాలలోని జిల్లా జైలును ఆ తర్వాత నగరం లోని మహిళా జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన నేరాలను మరిచిపోయి సమాజంలో మంచి పౌరులుగా మారడానికి శిక్షా కాలాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఖైదీలకు సృజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌లను ఏర్పాటు చేశారని, అందులో ఓ అడ్వకేట్‌, ఓ పారా లీగల్‌ వలంటీర్‌ ఉంటారని, వారి ద్వారా ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు.ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు హెల్ప్‌లైన్‌ నెంబర్‌.15100 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa