ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరాచీ స్టేడియంలో ఖాళీ కుర్చీలు

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:41 PM

ఎన్నో ఏళ్ల కల.. పాకిస్తాన్‌‌కు పెద్ద గౌరవం.. అట్టహాసంగా ప్రారంభించాం.. 29 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశం ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ చెప్పిన మాటలివి. 1996 తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ ఇది. ప్రపంచ దేశాలన్నీ క్రికెట్ చూసేందుకు పాక్‌కు పయనం కడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కలలు కనింది. అయితే అవన్నీ పగటి కలలేనని తొలి మ్యాచ్‌తో తేలిపోయాయి.


పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభ మ్యాచ్‌కి ప్రేక్షకులు కరువయ్యాయి. ఈ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ జట్టు ఆడుతున్నా కూడా చూసేందుకు జనాలు రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్ పేలుతున్నాయి. అంతన్నారు ఇంతన్నారు కనీసం చూసేందుకు జనాల్ని కూడా పిలుచుకోలేకపోయారని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకల్ వాన్ సెటైర్లు వేశాడు. "పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. 1996 తర్వాత పాకిస్తాన్ సొంతంగా నిర్వహిస్తున్న అతిపెద్ద టోర్నీ ఇది. ఇంతపెద్ద టోర్నీ జరుగుతున్న విషయాన్ని వాళ్లు లోకల్స్‌కి చెప్పడం మరచిపోయారా ఏంటి. అసలు క్రౌంటి ఏదీ" అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa