ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫస్ట్ మ్యాచ్ ఆరంభంలోనే డ్రామా నడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. షాహీన్ షా అఫ్రిది వేసిన రెండో బంతిని కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ఎక్స్ట్రా కవర్లోకి నెట్టాడు. బౌండరీ వైపు వెళ్తున్న ఆ బంతిని ఆపే యత్నంలో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. ఆ బంతికి న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు తీశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలోనే తమ ప్లేయర్ గాయపడటంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బౌండరీ దగ్గర కాలి మడమ గాయమైనట్లు తెలుస్తోంది. బంతిని మరో ఫీల్డర్కి అందించి బౌండరీ బయట కూర్చున్నాడు. ఫిజియో వచ్చి చూసినా లాభం లేకపోవడంతో గ్రౌండ్ని విడవాల్సి వచ్చింది. ఫఖర్ జమాన్ స్థానంలో సబ్స్టిట్యూట్గా కమ్రాన్ గులామ్ ఫీల్డింగ్కి వచ్చాడు. పాకిస్తాన్ ఓపెనర్ బ్యాటర్ ఫఖర్ జమాన్కి ఇలా కావడంతో పాక్ ప్లేయర్లు కూడా టెన్షన్ అవుతున్నారు.
ఫఖర్ జమాన్ కోలుకోకపోతే పాకిస్తాన్ జట్టుకు చాలా ఇబ్బందనే చెప్పొచ్చు. న్యూజిలాండ్తో మ్యాచ్ అనంతరం పాక్-భారత్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్పై ఫఖర్ జమాన్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మ్యాచ్ని సైతం మలుపుతిప్పే బ్యాటింగ్ ఫకర్ జమాన్ది. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాలని పాకిస్తాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa