ఇటీవలి కాలంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చూసినా.. దగ్గర దగ్గరగా ఒకటే రకమైన హామీలను అన్ని పార్టీలు ఓటర్లకు గుప్పిస్తున్నాయి. పెన్షన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్పై రాయితీ, ఉచిత బస్సు పథకం, ఉచిత విద్య వంటి హామీలను కురిపిస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఉచిత స్కూటీ పథకాన్ని అమలు చేసేందుకు ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధం అయింది. మెరిట్ కలిగిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందిస్తామని.. 2022 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫేస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ ఉచిత స్కూటీ పథకాన్ని ప్రారంభించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2025-2026 ఏడాదికి గానూ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన యూపీ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా ఈ ఉచిత స్కూటీ పథకాన్ని ప్రతిపాదించారు. ఇక ఈ ఉచిత స్కూటీ పథకం అమలు కోసం యూపీ బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన విద్యార్థినులకు.. ఈ పథకం కింద ఉచితంగా స్కూటీలు అందించనున్నట్లు తెలిపారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఈ ఉచిత స్కూటీ ప్రభుత్వ పథకానికి మహారాణి లక్ష్మీబాయి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2025-2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.8.08 లక్షల కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకువచ్చింది. అయితే ఇది గతేడాది అంటే 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కంటే 9.8 శాతం అధికం కావడం గమనార్హం. ఇక యోగి ఆదిత్యనాథ్ బడ్జెట్పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు బీజేపీ ఇచ్చిన హామీలు పెరుగుతున్నాయి కానీ.. రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో నీటిపారుదల కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఆ హామీని నెరవేర్చడంలో యోగి సర్కార్ విఫలం అయిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa