ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాణాలకు ముప్పు?

national |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 09:50 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ప్రయాణించే కారులో బాంబు పెట్టామని.. దాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ చేశారు. ఈ వియం గుర్తించిన వెంటనే ఖాకీలు ఏక్‌నాథ్ షిండేను కలిసి ఆయన కారులో సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆయనకు ముప్పు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మరి పోలీసులకు ఆ కారులో బాంబు దొరికిందా లేదా తెలియాలంటే మీరి కథ చదివేయాల్సిందే.


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రాణాలు తీస్తామంటూ.. ముంబయిలోని గోరెగావ్ పోలీసులకు గురువారం రోజు మధ్యాహ్నం ఓ మెయిల్ వచ్చింది. ఆయన కారులో బాంబు పెట్టామని.. దాన్ని పేల్చబోతున్నట్లు అందులో వివరించారు. ఈ ఒక్క స్టేషన్‌కే కాకుండా జేజే మార్గ్ పోలీస్ స్టేషన్, రాష్ట్ర సచివాలయానికి కూడా ఇదే మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డిప్యూటీ సీఎం ఎక్కుడన్నారో తెలుసుకని మరీ పరుగులు పెట్టారు. ఆయనకు అసలు విషయాన్ని చెప్పి.. కారులో తనిఖీలు చేపట్టారు.


బాంబు స్క్వాడ్ల సాయంతో ఈ సోదాలు నిర్వహించగా అందులో ఏమీ దొరకలేదు. దీంతో పోలీసులు ఆయనకు సంబంధించిన అన్ని కార్లలోనే తనిఖీలు చేపట్టారు. ఎందులో కూడా బాంబు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆపై దర్యాప్తు చేపట్టగా ఇదంతా బూటకం అని తెలిసింది. ఈక్రమంలోనే ఆ మెయిల్ చేసింది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.


ఇదంతా ఇలా ఉండగా.. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువ అవుతున్నాయి. గతంలో దేశరాజధాని ఢిల్లీ పాఠశాలలకు మెయిల్స్ రాగా ఈమధ్య విమానాశ్రయాలు, బ్యాంకులు, రాజకీయల నాయకులకు కూడా వస్తున్నాయి. చూడాలి మరి వీటన్నిటినీ ఆపేందుకు పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com