ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై పాక్ గెలిస్తే రూ. కోటి బహుమతి: గవర్నర్ కమ్రాన్ ఖాన్

international |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 07:59 PM

భారత్దా- పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పాక్ గవర్నర్ ముహమ్మద్ కమ్రాన్ ఖాన్ టెస్సోరి ఓ బహిరంగ ప్రకటన చేశారు. దుబాయి గడ్డపై భారత్‌ను ఓడిస్తే, కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పాకిస్తాన్ ఆటగాళ్లకు హామీ ఇచ్చారు. ఇది తానొక్కడి కోరిక కాదని, యావత్ దేశం అదే కోరుకుంటోందని టెస్సోరి ఆ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.ఇదిలావుంటే, కీలక పోరులో ఇప్పటికే దాయాది జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగుల వద్ద ఆలౌటైంది. సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (23), సల్మాన్ అఘా (19), ఖుష్‌దిల్ షా (38) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa