ఆఫ్గనిస్తాన్ మరోసారి అద్భుతం చేసింది. తన కంటే బలమైన ఇంగ్లండ్ జట్టును ఓడించడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటికి పంపించింది. పాకిస్తాన్లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ ఇంటి బాట పట్టింది. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టి ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించింది. చివరివరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్గనిస్తాన్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఆఫ్గనిస్తాన్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్.. ఇంగ్లండ్ ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివర్లో అద్భుతమైన బౌలింగ్ చేసిన ఆఫ్గన్ బౌలర్లు.. మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. దీంతో జో రూట్ సెంచరీ వేస్ట్ అయింది. ఆఫ్గన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్తాన్ భారీ స్కోరు చేసింది. 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ సంచలన ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ ముందు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 146 బంతులు ఆడిన ఇబ్రహీం జర్దాన్.. 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. ఈ సెన్సేషనల్ ఇన్నింగ్స్తో ఇబ్రహీం జర్దాన్ అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు(177) సాధించిన బ్యాటర్గా జద్రాన్ నిలిచాడు. అంతేకాకుండా అఫ్గానిస్తాన్ తరఫున ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో సెంచరీ చేసిన బ్యాటర్గా జద్రాన్ పేరు లిఖించుకున్నాడు. ఇక ఆఫ్ఘాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా 41, షాహిదీ 40, నబీ 40 పరుగులు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa