ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు మద్ధతు ధర కోరుకోవడం ఎండమావే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 11:33 AM

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కాడి వదిలేసే పరిస్థితి వస్తుందని, చంద్రబాబు విజన్‌కి తగ్గట్టు వ్యవసాయం దండగ అనే రీతిలో ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ  నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన పదవిని కాపాడుకోవడానికి లోకేష్‌ను పొగిడే స్థాయికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు. అన్నదాత సుఖీభవకు కేటాయింపులు చూస్తే లబ్ధిదారులను తగ్గించే కుట్ర కనిపిస్తోందని చెప్పారు. పంటలకు మద్ధతు ధరలేక ఒక రైతులు అల్లాడిపోతున్నా వారి గురించి పట్టించుకోకుండా ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించారని దుయ్యబట్టారు. ఇకపై రైతులు మద్ధతు ధర కోరుకోవడం ఎండమావే అవుతుందని, తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa