ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతన్నలకు ఉచిత విద్యుత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 02:05 PM

నేతన్నలు, నాయీబ్రాహ్మణులకు విద్యుత్‌ భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లుగానే నేతన్నలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్‌ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అందుబాటులోకి వస్తే గుంటూరు జిల్లాలో 10 వేలు, బాపట్ల జిల్లాలో 17 వేలు, పల్నాడు జిల్లాలో 3 వేల చేనేత కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయగా, తాజాగా ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం పునరుద్ధరిస్తే నాయీబ్రాహ్మణ, రజక, చేనేత, కల్లుగీత కార్మికులు, కుమ్మరి, కమ్మరి ఇతర కుల, చేతి వృత్తులవారికి వృత్తిపరమైన భరోసా లభించే అవకాశం ఉందనడంలో సదేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa