నేతన్నలు, నాయీబ్రాహ్మణులకు విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లుగానే నేతన్నలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అందుబాటులోకి వస్తే గుంటూరు జిల్లాలో 10 వేలు, బాపట్ల జిల్లాలో 17 వేలు, పల్నాడు జిల్లాలో 3 వేల చేనేత కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయగా, తాజాగా ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం పునరుద్ధరిస్తే నాయీబ్రాహ్మణ, రజక, చేనేత, కల్లుగీత కార్మికులు, కుమ్మరి, కమ్మరి ఇతర కుల, చేతి వృత్తులవారికి వృత్తిపరమైన భరోసా లభించే అవకాశం ఉందనడంలో సదేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa