టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొన్న జింబాబ్వే, భారత్తో జరిగే కీలక మ్యాచ్కు మరింత తెలివిగా సిద్ధమవుతోంది. జింబాబ్వే హెడ్ కోచ్ జస్టిన్ సమన్స్ మాట్లాడుతూ "భారత్ ఎలా ఆడబోతుందో మాకు తెలుసు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన విధంగానే భారత్ కూడా పూర్తి దూకుడుతో వస్తుంది. వాళ్లు ఏమాత్రం వెనకడుగు వేయరు" అని అన్నారు. వెస్టిండీస్ మ్యాచ్ నుంచి ఒత్తిడిని ఎదుర్కోవడం, ప్రశాంతంగా ఉండటం, పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి పాఠాలు నేర్చుకున్నామని, బౌలింగ్ వ్యూహాలను మెరుగుపర్చుకుంటామని సమన్స్ తెలిపారు. గురువారం చెన్నైలో భారత్తో జింబాబ్వే తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa