ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 03:23 PM

నేడు నెల్లూరు జిల్లాలో వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారని.. అందులో తాను కూడా బాధితుడినే అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదవుతున్నాయన్నారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదని చెప్పారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమన్నారు. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు నారాయణ. కొన్ని రోజులు ఆగితే అన్నీ వస్తాయన్నారు. తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించారని తెలిపారు. మునిసిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మునిసిపాలిటీలో అభివృద్ధికే వెచ్చిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్ళేవని...దీనివల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. 15 వ ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిని ఇస్తామన్నారు. మూడేళ్ళలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శిస్తూ.. దానిని గాడిలో పెడుతున్నామన్నారు. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa