ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తొక్కిసలాట ఘటనపై సాక్ష్యం చెప్పేందుకు స్థానికుల విముఖత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 09:52 AM

జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌కు సాక్ష్యం చెప్పడానికి దుకాణదారులు ఆసక్తి కనబరచడం లేదు. ‘బైరాగిపట్టెడ పార్కు వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మీరు కళ్లారా చూసింది చూసినట్టు చెప్పండి.. మీకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు’ అంటూ వీఆర్వోలు, ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ సిబ్బంది విజ్ఞప్తి చేయగా.. ‘అబ్బే ఆ రోజు మేము షాపులో లేము’ అని కొందరు.. షాపులు మూసివేశామని మరికొందరు.. జనాలు ఎక్కువ ఉండడంతో ఇంటికి వెళ్లిపోయామని ఇంకొందరు బదులిచ్చారు. వాంగ్మూలం ఇస్తే తర్వాత ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వారు ముఖం చాటేస్తున్నారని తెలిసింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై నిజనిర్థారణకు నెల రోజులుగా ఏకసభ్య కమిషన్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa