ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత గ్యాస్‌ కి సబ్సిడీ అందడం లేదని ఆవేదన చెందుతున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:04 AM

కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కొంతమందికి అందడం లేదు. సాంకేతిక సమస్యలే దీనికి కారణమని అధికారులు వెల్లడిస్తున్నారు. గతేడాది నవంబరు 1న ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముందుగా వినియోగదారులు సిలిండర్‌ ధర ఏజెన్సీలకు చెల్లించాలని, రెండు రోజుల్లో ఆ డబ్బులు మొత్తం సబ్సిడీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు తొలివిడత కింద ఇప్పటివరకూ 70 శాతం మందికి మాత్రమే సిలిండర్‌ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమయ్యాయి. తొలి సిలిండర్‌ సరఫరాకు ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉండడంతో సిలిండర్‌ సబ్సిడీ తమకు వర్తిస్తుందో లేదోనని మిగిలిన గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa