ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ రాజీనామా.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 06:20 PM

కేరళ బీజేపీ మాజీ చీఫ్ అయిన రాజశేఖరన్ 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటు న్నారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. తొమ్మిది నెలల క్రితమే మిజోరాం గవర్నర్ గా ఇతను నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ పదవికి నేడు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఆయనను నిలబెట్టాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ నిర్ణయం మేరకే రాజీనామా చేసినట్టు ఓ కేరళ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంలో రాజశేఖరన్ తెలిపారు. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa