రాష్ట్ర భవిష్యత్తుఎంఎస్ఎంఈలపై ఆధారపడి ఉందని, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని ఎంఎ్సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. కొత్త పారిశ్రామిక పాలసీ 4.0 కింద 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎంఎ్సఎంఈ ద్వారా ఉద్యోగాల సృష్టిపై అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలు కోరగా.. దీనిపై ప్రత్యేక దృష్టిపెడతామని చెప్పారు. ఎంఎ్సఎంఈ పార్క్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా సర్వే చేస్తున్నామన్నారు. తొలుత ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర పథకాలు అనేకం ఉన్నాయని, వీటిపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీఐఐసీని ప్రక్షాళన చేయాలని, భూముల రేట్లు తగ్గించాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఐఐసీ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని సభ్యులు అంటున్నారని, తమిళనాడుతో పోల్చితే మన రాష్ట్రంలో చాలా తక్కువ ధరకు భూమి ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక జీవో ద్వారా భూమి రేటు ఇంకా తగ్గిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa