బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనకు వయసు అయిపోయిందని.. కనీసం ఉపముఖ్యమంత్రులను కూడా గుర్తు పట్టడం లేదని చెప్పుకొచ్చారు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలేనని.. కానీ సీఎం నితీష్కు ప్రస్తుతం 75 ఏళ్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇలా రిటైర్ అయిపోయిన సీఎం మనకు అవసరమా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం తేజస్వీ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజు అసెంబ్లీ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. తేజీస్వీ యాదవ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ.. తేజస్వీ యాదవ్పై విరుచుకు పడ్డారు. నా కారణంగానే నీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని చెప్పుకొచ్చారు. ఆయనకు తాను మద్దతు ఇస్తుంటే.. లాలూ సొంత మనుషులే వద్దన్నారని.. మీరిలా చేయడం ఎందుకంటా ప్రశ్నించారని వివరించారు. ఎవరేం చెప్పినా తానే సాయం చేశానని.. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయంగా ఎదగ గలిగారని వ్యాఖ్యానించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తేజస్వీ యాదవ్ నేడు.. ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేశారు. నితీష్ కుమార్ అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. పాత వాహనంతో పోల్చారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం బిహార్ ప్రజలకు వద్దని చెప్పారు. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలేనని కానీ ముఖ్యమంత్రికి 75 ఏళ్ల వయసు వచ్చిందని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారని.. చాలా అలిసిపోయారని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని.. పాత వాహనంతో ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు. సరికొత్త దృక్పథంతో అభివృద్ధి సాధించాలని.. ప్రస్తుతం ఉన్న సీఎంకు కనీసం ఉప ముఖ్యమంత్రుల పేర్లు కూడా గుర్తు లేవని తేజస్వీ యాదవ్ తెలిపారు. త్వరలోనే తమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa