ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీకి ఉత్తర ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం షాక్ రూ.200 జరిమానా

national |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:46 PM

మూడేళ్ల క్రితం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వీర్ సావర్కర్ బ్రిటీష్ సేవకుడు అని.. వారి నుంచి పింఛన్ కూడా తీసుకున్నారంటూ చెప్పారు. దీంతో ఓ వ్యక్తి ఇతడిపై కేసు పెట్టగా.. న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే ఈ కేసులో ఎన్ని సార్లు కోర్టుకు హాజరు కావాలని చెప్పినా రాహుల్ గాంధీ హాజరుకాలేదు. దీంతో నేడు మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు 200 రూపాయల జరిమానా విధించింది. ఏప్రిల్ 14వ తేదీన జరపబోయే విచారణలో కచ్చితంగా హాజరు కావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2022వ సంవత్సరంలో రాహుల్ గాంధీ మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడే ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వీర్ సావర్కర్ బ్రిటీష్ సేవకుడు అని చెప్పారు. అంతేకాకుండా ఆయన వారి వద్ద నుంచి పింఛన్ కూడా పొందారని వివరించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్వాతంత్ర సమరయోధుడు అయిన వీర్ సావర్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. వాటిని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పాలని చాలా మందే డిమాండ్ చేశారు.


అయితే నృపేంద్ర పాండే అనే వ్యక్తి మాత్రం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో కోర్టుకు వెళ్లారు. రాహుల్ గాంధీ కావాలనే.. స్వాతంత్ర సమరయోధుడు అయిన వీర్ సావర్కర్‌ను కించ పరిచారని చెప్పారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానం విచారణ జరిపింది. కానీ ఏ ఒక్క విచారణకు రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అయితే తాజాగా నేడు కోర్టు విచారణ జరపగా.. రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరై వాదించారు.


ప్రస్తుతం లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ చాలా బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కానీ రాహుల్ గాంధీ పదే పదే విచారణకు గైర్హాజరు అవుతుండడంతో కోర్టు 200 రూపాయల జరిమానా విధించింది. ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే విచారణకు కచ్చితంగా హాజరు కావాని అప్పర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం వెల్లడించింది. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa