ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్గా నేను ఎలా ఇవ్వలను? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్తోపాటు గత ఏడాది తనకు రాసిన లేఖలోని అంశాలపై పూర్తి వివరణ ఇస్తూ బుధవారం అసెంబ్లీలో ఆయన ఒక రూలింగ్ ఇచ్చారు. నిబంధనలు, సంప్రదాయాల గురించి తెలిసినప్పటికీ జగన్, ఆయన పార్టీ నేతలు నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకరుకు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు. ‘‘జగన్ సాగించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను’’ అని తెలిపారు. ఇదే సందర్భంలో... సభకు హాజరు కావాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa