ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకే దూషణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 08:25 AM

కూటమి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ లోని డొల్లతనాన్ని  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ లెక్క‌ల‌తో స‌హా ప్ర‌భుత్వాన్ని ప్రశ్నిస్తే కనీసం దానికి సమాధానం చెప్పే ధైర్యం కూడా ప్రభుత్వంకు లేదని గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీఅధ్య‌క్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో మోసం చేస్తున్నారు, మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాలతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. అప్పులపై తండ్రీకొడుకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. వీటిపై వైయస్ జగన్ గారు నిలదీస్తే సమాధానం చెప్పలేక దూషణలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇలా మాట్లాడటానికి లోకేష్ ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. మూడు ఆత్మల కథ ఏపీ ప్రజలు ఎప్పుడో విన్నారు. అందులో ఒక ఆత్మ ఎన్టీఆర్ గారు అయితే ఇంకో ఆత్మ నందమూరి హరికృష్ణ. మూడో ఆత్మ లోకేష్‌ బాబాయ్ నారా రామ్మూర్తినాయుడు. ఈ మూడు ఆత్మలు చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేసిన నేరాలు, ఘోరాల గురించి తెగ చెప్పాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa