ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 9న విటోపియా-2025

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 11:31 AM

 వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా-2025 పేరిట మూడు రోజుల భారీ సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ‘వసుదైకం’ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విటోపియా-2025ను శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 9వ తేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిభ, క్రీడా స్ఫూర్తి, సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేలా రూపొందించారు. పలు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక ర్యాలీ: ‘వసుదైకం’తో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంప్రదాయ వస్త్రధారణతో తమ ప్రాంతీయ నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విటోపియా-2025 మన దేశ సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా ఉందని, ఇది మరుపురాని వేడుక అవుతుందని శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. విటోపియా-2025 విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి వీటీటీ-ఏపీ రూపొందించిన అద్భుత కార్యక్రమమని వీఐటీ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ శంకర్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు. విద్యా సంబంధ విషయాల్లో ప్రోత్సాహంతో పాటు, విద్యార్థుల్లో సృజనాత్మకత వ్యక్తీకరణకు, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తుందని వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.కోటా రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa