ఆత్మహత్యకు పాల్పడిన భార్య బాధితుడు.. తన సంస్థ వెబ్సైట్లో సూసైడ్ నోట్ అప్లోడ్ చేశాడు. ముంబయిలో గతవారం చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన 41 ఏళ్ల నిషాంత్ త్రిపాఠీ గత శుక్రవారం సహారా హోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో భార్య అపూర్వ పారిఖ్, ఆమె మేనత్త ప్రార్థన మిశ్రాల వేధింపులే తనకు చావుకు కారణమని ఆరోపించాడు. దీనిని తన కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. మూడు రోజుల కిందట హోటల్లో చెక్ ఇన్ అయిన నిషాంత్.. గెస్ట్లు ప్రైవనీ కోసం ఉపయోగించే ‘డోన్ట్ డిస్టర్బ్’ అనే బోర్డు ఉంచి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా సేపు ఎటువంటి స్పందన లేకపోవడంతో మాస్టర్ కీ సాయంతో హోటల్ సిబ్బంది ఆ గది తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. నిషాంత్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు.
మహిళ హక్కుల కార్యకర్త అయిన నిషాంత్ తల్లి నీలిమ చతుర్వేది ఫిర్యాదుతో అపూర్వ, ఆమె మేనత్త ప్రార్థనలపై పోలీసులు కేసు నమోదుచేశారు. తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన నిషాంత్.. తన మరణానికి ఆమెతోపాటు ఆమె అత్తను బాధ్యులుగా పేర్కొన్నాడు. ‘ఈ లేఖ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండను.. నా ఈ చివరి క్షణాల్లో జరిగిన ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించగలను. కానీ నేను అలా చేయను.. ఈ క్షణం నేను ప్రేమను ఎంచుకున్నాను.. నిన్ను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేను ప్రేమిస్తూనే ఉంటాను...నేను ఇచ్చిన మాటను తప్పను.. నువ్వు, ప్రార్థన మిశ్రాలే నా మరణానికి కారణమని నా తల్లికి తెలుసు. కాబట్టి అమెను కలవడానికి ప్రయత్నిచవద్దని వేడుకుంటున్నాను. ఇప్పటికే చాలా అలసిపోయిన ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వండి’ అని నిషాంత్ రాసిన నోట కంటతడిపెట్టిస్తోంది.
తన కుమారుడి మరణంపై ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన నిషాంత్ తల్లి ‘మహిళల హక్కులు, లింగసమానత్వం కోసం జీవితం అంకితం చేసిన నేను .కొడుకును పోగొట్టుకుని జీవచ్ఛవంలా ఉన్నాను.’ కన్నీటిపర్యంతమయ్యారు. ‘నా జీవితం ఇప్పుడు ముగిసింది. నా కొడుకు నిషాంత్ నన్ను వదిలి వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు జీవచ్చవంగా మారిపోయాను. నాకు అంత్యక్రియలు చేయాల్సిన కొడుక్కి నేను అంతిమ సంస్కారాలు చేశారు . నా కూతురు ప్రాచీ తన అన్నయ్య కర్మకాండలు జరిపింది.. అత్యంత ఈ కష్టకాలంలో నాకు, నా కుమార్తెకు గుండె నిబ్బరం చేసుకునే ధైర్యాన్ని ప్రసాదించాలి’ అని ఆమె తన పోస్ట్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa