ఐపీఎల్ 2025 మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ తమ శిబిరాలను ప్రారంభించాయి. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం త్వరలో ఆయా ఫ్రాంఛైజీలతో కలవనున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే పలువురు ప్లేయర్లు గాయాలతో టోర్నీకి దూరం అవుతున్నారు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్కు చెందిన లిజార్డ్ విలియమ్స్ చేరిపోయాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 2025 మొత్తానికి దూరమయ్యాడు.
లిజార్డ్ విలియమ్స్ ప్లేసులో ముంబై ఇండియన్స్ జట్టు కార్బిన్ బాష్ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కాగా ఐపీఎల్ 2025 మెగావేలంలో లిజార్య్ విలియమ్స్ను ముంబై రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. కానీ అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఇదివరకే అరంగేట్రం చేశాడు. ప్రొటీస్ తరఫున ఒక టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. అతడు గతేడాది డిసెంబర్లో టెస్టుల్లో డెబ్యూ చేశాడు. పాకిస్థాన్తో జరిగిన ఆ మ్యాచ్లో అతడు తొలి ఇన్నింగ్స్లో అజేయమైన 81 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 4 వికెట్లు తీశాడు. రెండు వన్డేల్లో 2 వికెట్లు సహా.. 55 రన్స్ స్కోరు చేశాడు. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో బాష్.. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఎంఐ కేప్టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఇటీవల ముగిసిన సీజన్లో అతడు 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.
కాగా మార్చి 22న ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్లో ముంబై తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడుతుంది. చెన్నై వేదికగా హోమ్టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ను ముంబై ఢీకొట్టనుంది.
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు:
జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లాహ్ ఘజన్ఫార్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ శాంట్నర్, రీస్ టోప్లే, శ్రీజిత్ కృష్ణన్, రాజ్ అంగద్ బవా, పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్, విఘ్నేష్ పుతూర్, అర్జున్ టెండుల్కర్, కార్బిన్ బాష్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa