ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (మార్చి 9) మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ బిగ్ ఫైట్ జరగనుంది. అయితే భారత జట్టు ఇప్పటివరకు 13 ఐసీసీ ఫైనల్స్ ఆడింది. అందులో కేవలం ఒకే ఒక్క భారత బ్యాటర్ సెంచరీ చేశాడు.
2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ సెంచరీ చేశాడు. ఆ ఎడిషన్లో భారత జట్టు తరఫున చేసిన ఏకైక సెంచరీ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ కూడా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్యే జరిగింది. అయితే, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచి, టైటిల్ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (130 బంతుల్లో 117 రన్స్) శతకం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో సచిన్ 69 పరుగులు చేశాడు. అనంతరం ఛేజింగ్కు దిగిన న్యూజిలాండ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది.
భారత్ తరఫున ఐసీసీ టోర్నీల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్గా గంగూలీ నిలిచాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో గౌతమ్ గంభీర్ 97 రన్స్ (2011 వన్డే ప్రపంచకప్లో శ్రీలంకపై), మహేంద్ర సింగ్ ధోనీ 91* రన్స్ (2011 వన్డే ప్రపంచకప్లో శ్రీలంకపై), అజింక్య రహానే 89 రన్స్ (2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై), వీరేంద్ర సెహ్వాగ్ 82 రన్స్ (2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై)లు ఉన్నారు.
ఇక భారత్ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదుసార్లు ఫైనల్కు చేరింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. 2013లో భారత్ టైటిల్ సాధించింది. 2000, 2017లో భారత్ రన్నరప్గా నిలిచింది. మరి రేపటి ఫైనల్ మ్యాచ్లో ఎవరు హీరోగా నిలుస్తారో, భారత్కు ఎవరు టైటిల్ అందిస్తారో వేచి చూద్దాం..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa