ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల జిల్లాలో భగ్గుమన్న వైసీపీ,టీడీపీ కార్యకర్తల పాతకక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 11:11 AM

నంద్యాల జిల్లా కంపమల గ్రామంలో  పాత కక్షలు భగ్గుమన్నాయి. తెలుగుదేశం, వైసీపీ వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టీడీపీ,ర వైసీపీ వర్గాల దాడులతో కంపమల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ రెండు వర్గాల మధ్య పాత కక్షలు, పొలం తగాదాలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రెండు వర్గాలను ఉద్దేశించి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa