ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చే బిల్లుని ఆమోదించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 11:55 AM

ప్రజల సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించడం లేదని, వినతుల పర్యవేక్షణకు ఉపసంఘాన్ని నియమిస్తే పరిశీలించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏళ్ల తరబడి ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కోరారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు హార్టికల్చర్‌ సబ్సిడీ అమలు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర విజ్ఞప్తిచేశారు. టీటీడీ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో జారీచేయడం వల్ల భక్తులకు లభించడం కష్టంగా ఉందని, ఈ-దర్శన్‌లు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే రామకృష్ణబాబు కోరారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు పశువులు కారణమవుతున్నాయని.. వాటిని రోడ్లపైకి రానివ్వకుండా కట్టడి చేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. కర్నూలు జిల్లాలో వలసలు నివారించాలని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, తిరుపతి శివారు ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని తిరుపతి సభ్యుడు ఆరణి శ్రీనివాసులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa