ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన కృషితేనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషిచేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామని మంత్రి లోకేష్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa