ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేతలకి ప్రభుత్వం గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:52 AM

చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పవర్‌లూం యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల వల్ల 93 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు, 10,534 పవర్‌లూం యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఈ రెండు హామీలూ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం అమరావతి సచివాలయంలో 4 గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో వివిధ పనులను ఆయా సంస్థలకు అప్పగించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025ను ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com