ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 09:15 AM

రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీమ సాగునీటి కష్టాలను గట్టెక్కించే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోతిరెడ్డిపాడు పైనా, నేడు రాయలసీమ ఎత్తిపోతలపైనా ఇదే తరహాలో చంద్రబాబు సర్కార్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో తన మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు తీసుకురాలేని నిస్సహాయస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa