ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమాలో నా తల్లిని అసభ్యకరంగా చూపించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 09:43 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న నిందితుడు సునీల్‌ యాదవ్‌ ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తన తల్లిని అసభ్యకరంగా చూపించారని, ఆ సినిమాను నిలుపుదల చేయాలని ఎస్పీకి సునీల్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అలాగే ఈ సినిమాలో తన తల్లిపాత్రకు సంబంధించిన అభ్యంతరకర వీడియో క్లిప్‌లను పులివెందులకు చెందిన కొంతమంది సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ పులివెందుల పోలీసులకు, ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పులివెందుల అర్బన్‌ పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై సీఐ నరసింహులు కేసు నమోదు చేశారు. హత్య సినిమాలో కొన్ని అభ్యంతకర సీన్లను సోషల్‌ మీడియాలో పోస్టులు చేసినందుకు ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి పవన్‌కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదైన మిగతా నలుగురి వివరాలు పోలీసులు వెల్లడించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa