ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో టీడీపీలో చేరతానంటున్న మర్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 10:15 AM

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీపై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గుర్తింపు లేదు.. తనను చులకనగా చూశారని ధ్వజమెత్తారు. మర్రి రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి తాను వెళ్లిపోవడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వైఖరీనే కారణమని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదని మర్రి రాజశేఖర్‌ చెప్పారు. 2023 చివర్లో ఎమ్మెల్సీ ఇచ్చారని మర్రి రాజశేఖర్‌ గుర్తుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన రజినీని చిలకలూరిపేట ఇన్‌‌చార్జ్‌‌ని చేశారని చెప్పారు. రజినీని బలోపేతం చేయడానికి తనను అవమానించారని మండిపడ్డారు. త్వరలో టీడీపీలో చేరుతానని మర్రి రాజశేఖర్‌ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa