ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్‌ కేసులు త్వరగతిన పూర్తిచెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 10:40 AM

కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరుజిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు కేసుల విషయమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి న్యాయమూర్తి చట్టాలపై అవగాహన పెంచుకుని కేసులను త్వరగా పూర్తిచేసేలా తమవంతు పాత్ర పోషించాలన్నారు. కేసులు పెండింగ్‌లో ఉంటే కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం కేసుల పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావుతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa