ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులు అక్కడి నుంచే వస్తారు....: రజినీకాంత్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 07:36 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ఉగ్రవాద ముప్పు పట్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తగా ఉండాలని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. 26/11 ముంబై దాడులకు పాల్పడిన నిందితుల మాదిరిగానే ఉగ్రవాదులు.. సముద్ర మార్గాల గుండా దేశంలోకి చొరబడతారని వివరించారు. ఈక్రమంలోనే తీరప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వారిపై ఓ కన్నేసి ఉంచాలని వెల్లడించారు. అంతేకాకుండా వారి మీద ఏమైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మన దేశ ప్రతిష్టను, శాంతిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా దేశంలో ప్రవేశించి విధ్వంసకర ఘటనలకు పాల్పడుతున్నారని సూపర్ స్టార్ రజినీ కాంత్ వివరించారు. ఇందుకు ఉదారహణ 2011లో ముంబైలో జరిగిన బాంబు దాడులేనని చెప్పారు. ఇందులో మొత్తంగా 175 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పద స్థితిలో ఏమైనా చేసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు.


14 మంది మహిళలు సహా 125 మంది సీఎస్ఎఫ్ సైనికులు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర ప్రారంభించారని రజినీ కాంత్ చెప్పారు. వీరు రెండు గ్రూపులుగా మారి సైక్లింగ్ చేస్తున్నారని.. 25 రోజుల్లో 6553 కిలో మీటర్ల ప్రయాణించబోతున్నారని వివరించారు. వారు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు.. వారికి ఘన స్వాగతం పలకమని.. వీలైతే వారిని ప్రోత్సహించడానికి కొంచెం ముందుకు వెళ్లమని వివరించారు. తమిళ ప్రజలు వర్ధిల్లాలని.. తమిళనాడును అబివృద్ధి చేయండి అంటూ చివరలో చెప్పుకొచ్చారు. జైహింద్ అంటూ ఈ వీడియో సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం రజినీ కాంత్ విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఇదంతా ఇలా ఉండగా.. భారత దేశం మూడు వైపులా సముద్రం మరియు ఒకవైపు భూమితో చుట్టబడిన ద్వీప కల్ప దేశం. కాబట్టి 24 గంటలూ ఎల్లప్పుడూ భారీ నిఘా ఉంటుంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించడానికి ప్రభుత్వం వివిధ భద్రతా చర్యలు తీసుకుంటోంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి.. ఉగ్రవాదులను రానీయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com