ఏపీ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడానికి సిద్ధపడుతున్న జనసేన కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ బీఫారంలు సిద్ధమయ్యాయని, డిపాజిట్ చెల్లించి వాటిని తీసుకోవాలని ఫోన్లు చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని జనసేన తెలిపింది. అలాంటి నకిలీ ఫోన్ కాల్స్ (+401 లాంటి నంబర్స్ నుంచి) స్థానిక జనసేన నాయకులకు వెళ్లాయి. అభ్యర్థుల పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతూ, డిపాజిట్ల గురించి ప్రస్తావిస్తున్నారు. జనసేన నాయకులు, శ్రేణులు.. ఎవరూ ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ను పరిగణనలోకి తీసుకోవద్దని ఆ పార్టీ సూచించింది.
పార్టీ టికెట్లను అమ్ముకున్నారనే అపప్రద వచ్చే అవకాశం ఉండటంతో జనసేన ముందే జాగ్రత్త పడింది. ఇలాంటి ప్రచారం ఎన్నికల్లో పార్టీకి చేటు చేస్తుందనే ఉద్దేశంతో నకిలీ ఫోన్ కాల్స్ వస్తున్న వ్యవహారాన్ని బయటపెట్టింది. 2009లో టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం ప్రజారాజ్యం పార్టీకి చేటు చేసిన సంగతి తెలిసిందే. గత అనుభవాల కారణంగా ఈసారి అలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా జనసేన జాగ్రత్త పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa