ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 12:31 PM

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలు నచ్చే పార్టీలో చేరినట్లు పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తెలిపారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన త‌ర్వాత పొట్లూరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. నేను పుట్టి పెరిగిన విజయవాడ అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చా. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు ఉన్న మాట వాస్తవమే..వాటిని తిప్పి కొట్టేందుకు నేను సిద్ధం. పార్టీ ఆదేశిస్తే కచ్చితంగా విజయవాడ నుంచి పోటీ చేస్తా. మంచి రోజు చూసుకుని ఎన్నికల ప్రచారం మొదలు పెడతా. వైసీపీలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని పొట్లూరి వివరించారు. టీడీపీ తనకు ఎంతో అన్యాయం చేసిందని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. వైసీపీలో చేరిన అనంత‌రం తోట మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే కుటుంబం మాది. అలాంటి మమ్మల్నే అవమానిస్తే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం నాకు నచ్చలేదు. టీడీపీ నాకు సీటు ఇవ్వకపోవడం అన్యాయం. దీనిపై ఎన్నోసార్లు చంద్రబాబును కలిసినా ఫలితం లేదని తోట పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa